టీడీపీ, జనసేన అధినేతల భేటీ ఏమో గాను ఇప్పుడు అటు పొయ్.. ఇటు పోయ్ బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది ఏ వ్యవహారం.. పొత్తులు ఉంటాయని రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే క్రమంలోనే పవన్ – చంద్రబాబు, పవన్ – ప్రధాని మోదీల భేటీ ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం పైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. జనసేన తమ మిత్రపక్షమైనా జనసేన ఒక స్వతంత్ర పార్టీగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో అయినా చర్చించవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పవన్ ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదన్నది పవన్ ప్రయత్నంగా సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ వ్యాఖ్యలు ఏపీ బీజేపీ అదినాయకత్వానికి ఆగ్రహం చెప్పించాయి.. పొత్తులపై ఎవరు మాట్లావద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇది బీజేపీ పార్టీ అనీ సొంత నిర్ణయాలకు ఇక్కడ స్థానం లేదని.. పొత్తులా పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.
బీజేపీ నేతలు వ్యాఖ్యల పై బీజేపీ అధిష్టానం అగ్రహాంగా ఉందని సమాచారం.. పార్టీ లైన్ కు వ్యతిరేకంగాపొత్తులపై ఎవరు మాట్లాడవద్దు అనీ హెచ్చరించారు..పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిపైన చర్యలకు ఉపక్రమించిన్నట్లు సమాచారం. జాతీయ నాయకుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వారికీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనీ పార్టీ వర్గాల నుంచి సమాచారం.