Chandrababu Bailed Out : స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బయటకు వచ్చారు. అయితే గతంలో బెయిల్ కోసం చేసిన చాలా ప్రయత్నాలు ఫలించలేదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల సహకారం ఉండడంతో ఆయనకు బెయిల్ రావడం కష్టంగా మారింది. అయితే అనుకోకుండా ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది.
అయితే చంద్రబాబుకు బెయిల్ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య పోరు తీవ్రంగా జరుగుతున్నది. న్యాయం గెలిచిందని ధర్మం గెలిచిందని టీడీపీ సంబురాలు చేసుకుంటుంటే, అనారోగ్యం కారణాల తో నే బెయిల్ వచ్చిందని వైసీపీ కౌంటర్ వేస్తున్నది. చంద్రబాబు నిర్దోషి అని కోర్టు ఎక్కడా చెప్పలేదని సెటైర్లు వేస్తున్నది. అయితే చంద్రబాబుకు వచ్చిన బెయిల్ విషయంలో ఒక నేత సహకరించారని, ఆయన వల్లే బెయిల్ వచ్చిందని ప్రచారం జరుగుతున్నది.
అయితే చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన కార్యకర్తలు ఉన్నారు. జగన్ ఇంగ్లాండ్ లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయిస్తే, పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించారని వైసీపీ నాయకులకు జనసేన కార్యకర్తలు గట్టిగానే కౌంటరిస్తున్నారు. బీజేపీ పెద్దలను సంప్రదించి పవన్ ఈ బెయిల్ ఇచ్చారని చెబుతున్నారు.
చంద్రబాబు, పవన్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు అనుభవం రాష్ర్టానికి అవసరం ఉందని పవన్ పదే పదే చెబుతున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోమని చెబుతున్నారు. ఇక చంద్రబాబు కోసం ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడారని టాక్ వినిపిస్తున్నది. గతంలో ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు విషయంలో కొంత మెతకవైఖరి తో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. మరి ఇక ఇదే నిజమే అయితే వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.