Chandrababu Vision : సమాచార సాంకేతిక రంగాలు ప్రపంచానికే వెన్నెముక. ఐటీతోనే ఇప్పుడు అన్ని పనులు ముందుకు సాగుతున్నాయి. ప్రతి పనిలో ఐటీ ప్రభావం ఉంటోంది. సైబరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటీతో సాంకేతికత పరుగులు పెట్టించింది. సమాచార రంగంలో నూతన ఒరవడులు తీసుకొచ్చింది. మన వారిని దేశ విదేశాల్లో తెలుగు వారు సత్తా చాటుతున్నారంటే దానికి కారణం మన ఐటీనే.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో హైదరాబాద్ లో ఐటీ వినూత్నంగా ఎదిగింది. ఎంతో మందిని నిష్ణాతులుగా తయారు చేసింది. ఆయన వల్లే ఇప్పుడు హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. దాదాపు 25 ఏళ్ల క్రితమే ఐటీ కారిడార్ ను తీసుకొచ్చి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. లక్షలాది మంది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపారు.
ప్రపంచంలోని ప్రతి మూలలో మన తెలుగువారు ఉండటం గమనార్హం. ఐటీలో పనిచేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడే. ఐటీలో పనిచేసే వారికి మార్గదర్శకత్వం చేసిన నేత చంద్రబాబు. అలాంటి బాబును గత 45 రోజులుగా జైలలోనే బంధించారు. అక్రమ కేసులు పెట్టి అకారణంగా జైలులో ఉంచుతున్నారు. దీంతో బాబును జైలులో ఉంచడం వైసీపీ చేసిన తప్పిదంగానే అభివర్ణిస్తున్నారు.
చంద్రబాబు ఆలోచనతోనే ఐటీ పరిశ్రమ అంతలా పెరిగింది. ఆపిల్, సిలికాన్ వ్యాలీ లాంటి పరిశ్రమలు రాకముందే బాబు నగరంలో ఐటీని స్థాపించి భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్నారు. దీంతోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. ఫలితంగా ఐటీని మేటిగా చేయడంలో ఆయన పాత్ర కీలకం. ఈనేపథ్యంలో ఐటీ కోసం ఆయన చేసిన త్యాగమే నేటి తరానికి దిక్సూచిగా మారుతోంది.