Telangana BJP : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన బండి సంజయ్ ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తనదైన శైలిలో పనిచేశారు. పార్టీలో ఉత్సాహం నింపడంలో సఫలీకృతుడయ్యాడు. అయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, హుజురాబాద్ ,దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. అయితే కొంతకాలంగా పార్టీ లో రాష్ట్రస్థాయి కీలక నేతలకు, బండి సంజయ్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది. పలువురు అధిష్టానానికి బండి సంజయ్ తీరుపై ఫిర్యాదులు చేశారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎలక్షన్ సమయంలో పుస్తెలు అమ్ముకున్న వ్యక్తి , రూ.100 కోట్లు విలువ చేసే యాడ్లు పేపర్లు కు ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఇక బండి సంజయ్ మార్పు ఖాయమని ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే పార్టీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై ఫైర్ బ్రాండ్ విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. నిప్పులు పుట్టించే నడకను పార్టీకి నేర్పించిన బండి సంజయ్ గారి మార్పు బాధాకరమన్నారు. అయితే ఆయనకు మరింత మంచి బాధ్యతను పార్టీ అప్పగిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల మనోభావాలు బీజేపీ అగ్రనాయకత్వం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. బండి సంజయ్ పార్టీ కోసం ఎంతో చేశారని ఆమె చెప్పకనే చెప్పారు.
అయితే బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ఊహగానాలు బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం వస్తుందని అంతా భావిస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ ని నియమిస్తారని పలు చానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ReplyForward
|