క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం చిరంజీవి ఒక్క పైసా కూడా తీసుకోలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
లాభాల్లో వాటా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రైట్స్ను భారీ రేటుకు అమ్మేసిన మేకర్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా కూడా భారీ మొత్తాన్ని రాబట్టనున్నారని సమాచారం.
కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్లో చిరంజీవికి మేజర్ షేర్ ఉంటుందని, అయితే ఈ సినిమా ఇతర రైట్స్ ద్వారా వచ్చిన లాభాలతో నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతారని, అవి కూడా భారీ మొత్తాన్ని రాబట్టాయని అంటున్నారు.
కీర్తి సురేశ్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 11 ఆగస్టు, 2024న విడుదల చేస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.