Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన వారు రాజకీయాల్లోనూ తమ ప్రభావం చూపారు. అందులో ఎన్టీఆర్, జయలలిత వంటి వారు సీఎంలుగానే శాసించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని జనసేన పార్టీ స్థాపించి ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కు మద్దతు లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు.
ఇప్పుడు అందరు పవన్ వెంట నిలుస్తున్నారు. సినిమా పరిశ్రమ మొత్తం పవన్ వెనకే నిలిచింది. గతంలో ఎదురు తిరిగిన వారే ఇప్పుడు పవన్ చెంత చేరుతున్నారు. యువ నటుడు నవదీప్ పవన్ కోసం ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ వెంట నడిచేందుకు రెడీ కావడం గమనార్హం. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ అండగా నిలవడం శుభదాయకమే.
ఇన్నాళ్లు సొంత కుటుంబం కూడా దూరంగానే ఉన్నా ప్రస్తుతం వారు కూడా దగ్గరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్లు విరాళం ఇవ్వడం ఆహ్వానించదగినదే. దీంతో మెగా కుటుంబం కూడా ప్రస్తుతం జనసేన వెంట నడిచేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాలు జనసేనకు మేలు చేసేవే. ఈనేపథ్యంలో ఏపీలో పవన్ కూటమి విజయం సాధించడం తథ్యమని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో పోసాని కృష్ణమురళి, చిన్నికృష్ణ, పృథ్వీ లాంటి వాళ్లు పనిగట్టుకుని పవన్ కల్యాణ్ ను నిందించి వైసీపీ జెండా భుజాన ఎత్తుకున్నారు. ప్రస్తుతం వారు కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా అందరు పవన్ కల్యాణ్ వెనుక నడిచేందుకు సిద్ధంగా ఉండటంతో ఇక ఎన్డీయే కూటమిదే విజయంగా భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు కచ్చితమే అంటున్నారు. వైసీపీపై వ్యతిరేకత ఎన్డీయే కూటమి విజయానికి బాటలు వేస్తుందని సూచిస్తున్నారు. ఈక్రమంలో ఏపీలో అధికార మార్పిడి ఖాయమనే వాదనలు వస్తున్నాయి. ఇన్నాళ్లు జగన్ సాగించిన రాక్షస పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఎన్డీయే కూటమికి జై కొడతారని చెబుతున్నారు.