రాఖీ కట్టే సందర్భంలో కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. రాఖీ కట్టే సందర్భంలో యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబల: తేన త్వామభి బద్నామి రక్ష మావల మావల అనే శ్లోకం చదువుకుని రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తరువాల సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. తరువాత సోదరి తన సోదరుడికి స్వీటు తినిపించాలి.
రాఖీ పండగ విశిష్టత గురించి తెలుసుకుని దాని నిబంధనలు పాటించాలి. సోదరుడికి ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని దీవించాలి. తన పుట్టిళ్లు బాగుంటేనే ఆడబిడ్డ మనసు కుదుట పడుతుంది. ఇలా రాఖీ పండగ జరుపుకోవడంలో ఉన్న సూత్రాలు జాగ్రత్తగా పాటించి సోదరుడిని దీవించి అతడి కుటుంబానికి చేయూతగా నిలవాల్సి ఉంటుంది.
ReplyForward
|