Manchu Lakshmi :
మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్నారనే వాదనలు వస్తున్నాయి. కానీ అవేమీ లేవని కొట్టిపారేస్తున్నారు. ఆ మధ్య మంచి విష్ణు మనోజ్ అభిమానిపై దాడి చేశాడనే రూమర్లు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో వారి కుటుంబంలో అంతర్గతంగా విభేదాలు నెలకొన్నాయని చెబుతున్నారు.
మరోవైపు మంచు మనోజ్ పెళ్లిలో లక్ష్మి అన్ని తానై చూసుకున్నా విష్ణు కుటుంబం మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లారని అంటున్నారు. ఏదో అతిథిగా వచ్చి హాజరై అక్షింతలు వేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వారి మధ్య అభిప్రాయ భేదాలకు బీజం పడినట్లు వాదనలు కూడా వస్తున్నాయి. కానీ మంచు కుటుంబం మాత్రం అవేమీ లేవని చెబుతోంది. మా కుటుంబంలో సఖ్యత ఉందని చాటుతోంది.
నిన్న జరిగిన రాఖీ పండగలో మంచు మనోజ్ కు లక్ష్మీ రాఖీ కడుతోంది. కానీ చిత్రంలో విష్ణు మాత్రం కనిపించడం లేదు. దీంతో అసలు విష్ణుకు రాఖీ కట్టిందా? లేదా అనేది తెలియడం లేదు. ఈనేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు బయటకు రాకుండా బాగానే కవర్ చేస్తున్నా దాగుతాయా? నెటిజన్లు ఎప్పటికప్పుడు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అన్నదమ్ముల మధ్య అనుబంధం చెడిందా? అనే కోణంలో కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పుడు మంచు విష్ణు ఏం సమాధానం చెబుతాడు. మంచు లక్ష్మి విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదు. చిన్న తమ్ముడితోనే ఉంటుందా? విష్ణును ఇద్దరు దూరం చేసుకున్నారా? అనే కోణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనోజ్ కు రాఖీ కట్టిన లక్ష్మి ఓ రెస్టారెంట్లో లంచ్ చేసింది. దీంతో ఫొటో షేర్ చేసింది. కానీ అందులో విష్ణు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది.