మనకు ఆరోగ్యాన్నిచ్చేవి కూరగాయలు. శాఖాహారమే మనకు మంచిది. కానీ జిహ్వ చాపల్యం చంపుకోలేని వారు మాంసాహారాన్ని తీసుకుంటారు. కూరగాయలతో మనకు చాలా పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చుకుంటే ఎన్నో లాభాలున్నాయి. కొన్నింటిని పచ్చిగా తినొచ్చు. మరికొన్నింటిని ఉడించుకున్నాకే తినాలి. లేదంటే ఇబ్బందులొస్తాయి.
మనకు పోషకాలు ఎక్కువగా అందించేవి ఆకుకూరలు. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే వారంలో కనీసం మూడు సార్లయినా తీసుకుంటే మంచిది. ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, బచ్చలికూర, పొనగంటికూర, గోంగూర వంటివి ఉన్నాయి. వీటిని పచ్చిగా తినకూడదు. ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. దీంతో వీటిని ఉడికించినాకే తినాలి.
కాలీఫ్లవర్, క్యాబేజీ లను కూడా పచ్చివి తినొద్దు. ఇందులో పురుగులు ఉంటాయి. వీటిని వేడి నీళ్లలో ఉంచి తరువాత శుభ్రం చేసుకుని వండుకోవాలి. వంకాయలో పోలనిన్ అనే రసాయనాల సమ్మేళనం ఉంటుంది. వీటిని పచ్చిగా తినొద్దు. ఒకవేళ తింటే వికారం, వాంతులు, మైకం వస్తాయి. అందుకే వీటిని ఉడికించిన తరువాత మాత్రమే తినడానికి ఇష్టపడాలి.
కోడిగుడ్డు కూడా ఉడకబెట్టినవి మాత్రమే తినాలి. కొందరు పచ్చి గుడ్లు తాగుతుంటారు. ఇలా చేయొద్దు. ఇంకా పాలను కూడా మరగబెట్టనిదే తాగొద్దు. పచ్చి పాలు తాగడం వల్ల నష్టమే. అందుకే పాలను కాచుకున్నాక తాగడం బెటర్. పచ్చివి తీసుకుంటే ఎన్నో నష్టాలు ఉంటాయి. అందుకే ఉడికించిన తరువాతే తినడం మంచి అలవాటు.
ఇటీవల కాలంలో అందరు మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు. వీటిని కూడా పచ్చిగా తినొద్దు. పచ్చిగా తినడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా కూడా మన కడుపులోకి చేరుతుంది. వాటిని కాస్త వేపించుకుని తింటే మంచిది. అందులో టమాటాలు, నిమ్మరసం కలుపుకుని తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. పచ్చివి తినడం అంత సురక్షితం కాదు.