Budget 2024 : కేంద్ర ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. ఇవాళ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేసింది. వారి జీవితాల్లో వెలుగులు ప్రసరింపచేయాలని చూస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా పథకమే రూపొందించారు. వారి బతుకుల్లో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు సంకల్పించింది.
లాక్ పతి దీదీ పేరుతో తీసుకొచ్చిన పథకంతో మహిళలకు లబ్ధి చేకూరనుంది. 2024 బడ్జెట్ లో 3 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసింది. స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూర్చడంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇవ్వనుంది. మహిళలు బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం ఇస్తుంది.
ఆశ, అంగన్ వాడీలకు ఆయుష్మాన్ భారత్ లో స్థానం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం కవరేజ్ లభిస్తుంది. ఇలా మహిళలకు పలు పథకాలు తీసుకొస్తూ బీజేపీ వారికి మంచి ప్రయోజనాలు కలిగిస్తోంది. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇళ్ల సంఖ్యను పెంచుతోంది. పేదవారి సొంతింటి కల సాకారం చేస్తామని చెబుతోంది.
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా వ్యాపార సేవలు అందిస్తోంది. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని తెలిపింది. జన్ ధన్ ఖాతాల ద్వారా వారి ఖాతాల్లో డబ్బులు వేశామని పేర్కొన్నారు. 2047 వరకు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళతామన్నారు.