BUDGET 2024 – Lakshadweep : మాల్దీవుల వివాదం పెరిగిన వేళ మన పర్యాటకాన్ని డెవలప్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా లక్ష్యద్వీప్ ను సుందరంగా చేసి పర్యాటకులను ఆకర్షించాలని చూస్తోంది. దీని కోసం ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తోంది. లక్ష్యద్వీప్ ను అందమైన పర్యాటక ప్రాంతంగా చేసి లబ్ధి పొందాలని అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
జీ20 సమావేశాలు జరిగిన సమయంలో మన ఆర్థిక శక్తి, వ్యాపారాలకు కేంద్రంగా చేయాలని ప్రణాళికలు రచించింది. మధ్య తరగతి వర్గాలు కూడా ప్రయాణాలకు కొత్త ప్రాంతాల అన్వేషణలకు సుముఖత వ్యక్తం చేస్తున్నందున ఆధ్యాత్మికత పర్యటనలకు ప్రాంతాలను ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగానే అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
పోర్టు కనెక్టివిటీ, టూరిజం ఇన్ ఫ్రా, ఇతర వసతులను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. లక్ష్యద్వీప్ ను అన్ని రంగాల్లో డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పించాలనేది మన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్ లో పర్యటించి అక్కడి అందాలను ఆస్వాదించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.
మాల్దీవులతో సంబంధాలు కట్ చేసుకోవాలనే వాదనలు వచ్చాయి. మన సినిమా షూటింగ్ లు కూడా ఇక్కడే చేసుకోవాలని తేల్చేశారు. దీంతో మాల్దీవుల పరిస్థితి అధ్వానంగా మారింది. మన దేశ ఆదాయంతో పొట్ట పోసుకున్న మాల్దీవులు మనదేశ ఔన్నత్యాన్నే ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పుడు దాని ఆదాయానికి బొక్క పడింది. లక్ష్యద్వీప్ ను ప్రమోట్ చేయడం ద్వారా మన దేశ సంపదనను పెంచుకోవాలని ఆశించడంలో తప్పు లేదు.