Prashanth : కోలీవుడ్ లో ఒకప్పుడు భారీ విజయాలతో లైమ్ లైట్ లో ఉన్న హీరోల్లో ప్రశాంత్ ఒకరు.. ఈయన జీన్స్ సినిమాతో బాగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అజిత్, విజయ్ అప్పుడప్పుడే కోలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే ప్రశాంత్ స్టార్ గా ఎదిగాడు.. అయితే ఇప్పుడు ఈయన లైమ్ లైట్ లో లేడు..
అందుకు కారణాలు కూడా ఉన్నాయి.. ఈయన వరుస విజయాలతో దూసుకు పోతున్న సమయంలోనే తన వైవాహిక జీవితంలో ఏర్పడిన కలతల కారణంగా ఈయన పేరు బాగా వినిపించింది.. ఆ తర్వాత వరుస పరాజయాలు కూడా ఈయన స్టార్ డమ్ కోల్పోయేలా చేసింది.. అసలు ప్రశాంత్ వైవాహిక జీవితంలో ఏం జరిగిందంటే..
ప్రశాంత్ 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో పెళ్లి జరిగింది.. కానీ ఈ జంట 3 ఏళ్లకే విడిపోయింది.. వీరిద్దరి మధ్య గొడవలు నాలుగు గోడలు దాటి బయటకు రావడంతో అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది.. వీరికి పెద్ద గొడవలు జరగడంతో ఆయన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.. ఆ తర్వాత బిడ్డను కనింది.. ఆ బిడ్దను చూపించడానికి కూడా ప్రశాంత్ కు అవకాశం ఇవ్వలేదు.
ఈ గొడవ జరుగుతుండగానే ప్రశాంత్ భార్యకు అంతకు ముందే పెళ్లి అయ్యిందని.. 1998లోనే మా పెళ్లి జరిగింది అని నారాయణన్ అనే వ్యక్తి వీరి మధ్యలోకి రావడం గమనార్హం.. ఇక చివరికి ప్రశాంత్ విడాకులు అప్లై చేయగా కోర్టు మంజూరు చేసారు.. ఈ గొడవల కారణంగా ఈయన ఇమేజ్ బాగా డామేజ్ అయిపోయింది.. స్టార్ హీరోగా ఎదగాల్సిన ప్రశాంత్ సినిమాలకు దూరం అయ్యాడు..