Chicken Mutton : ఇటీవల కాలంలో రోగాలు వేధిస్తున్నాయి. పూర్వ కాలంలో యాభై ఏళ్లు దాటితే కానీ రాని మధుమేహం, రక్తపోటు వ్యాధులు ఇప్పుడు పాతికేళ్లకే పలకరిస్తున్నాయి. దీంతో శారీరక వ్యవస్థ అవస్థల పాలవుతోంది. లేనిపోని రోగాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మతిమరుపు కూడా ఓ వ్యాధిలా మారుతోంది. నిత్యం వేధింపులకు గురిచేస్తోంది. ఉన్నట్లుండి అన్నింటిని మరిచిపోవడం వంటి లక్షణాలు వేదనకు గురి చేస్తున్నాయి.
ప్రస్తుత కాలంలో అధిక ఒత్తిడి ఇబ్బందులకు గురి చేస్తోంది. చేసే ఉద్యోగాల్లో నిత్యం వేధింపులు వారిని సమస్యలకు లోనుచేస్తున్నాయి. పని ఒత్తిడి వల్ల వారి మెదడు పలు ఆలోచనలకు దారి తీస్తోంది. దీంతో ఏం పని చేస్తున్నామో కూడా గుర్తుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో చేసే పని కూడామరిచిపోయే అవకాశాలు ఉంటున్నాయి. మతిమరుపు తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది.
మధుమేహం, రక్తపోటు కారణంగా మతిమరుపు ప్రధాన సమస్యగా వస్తోంది. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల లోపాలు తలెత్తి మతిమరుపు ఓ మహమ్మారిలా వ్యాపిస్తుంది. దీనికి కారణం బి12 లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహార లోపంతో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బి12 మాంసాహారాల్లో అధికంగా లభిస్తుంది.
మతిమరుపుకు ప్రధాన కారణం ఒత్తిడి, అల్కహాల్ తీసుకోవడం వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయి. సరైన వ్యాయామం లేకుండా నిత్యం గతి తప్పిన ఆహారాలు తీసుకుంటే మతిమరుపు రావడం ఖాయం. ఈ క్రమంలో మతిమరుపును దూరం చేసే చర్యలు తీసుకోవాలి. మంచి ఆహారాలు తీసుకోవాలి. మద్యానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల కూడా మతిమరుపు వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అతిగా కాకుండా నెలలో ఒకటో రెండు రోజులో తినడం మంచిది. అలా కాకుండా నిత్యం మాంసాహారం తింటే మెదడు మొద్దుబారి పోవడం ఖాయమని చెబుతున్నారు.