IND Vs ENG : టీ 20 క్రికెట్ ప్రపంచకప్ లో రెండో సెమీస్ ఈ రోజు రాత్రి 8 గంటలకు బార్బడోస్ లో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ సారి రెండు టీంలు ఫేవరేట్ గా బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే డిపెండింగ్ చాంపియన్ అయిన ఇంగ్లండ్ మరో సారి టైటిల్ ఎగురేసుకుపోవాలని భావిస్తోంది.
ఇండియా 2007 లో టీ 20 ప్రపంచ కప్ నెగ్గగా.. రెండో సారి టైటిల్ గెలిచి విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలకు మంచి ఎండింగ్ ఇవ్వాలని అనుకుంటోంది. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ సెమీస్ చేరడం ఇది వరుసగా నాలుగో సారి కావడం విశేషం. ఇంగ్లండ్ ఈ టోర్నీలో అంత ఈజీగా సెమీస్ చేరలేదు. గ్రూపు మ్యాచులో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. గ్రూపు స్టేజిలో దక్షిణాఫ్రికా మీద ఓడిపోవడంతో సెమీస్ చేరడం కష్టమే అనుకున్నారంతా.. కానీ వెస్టిండీస్, యూఎస్ఏను ఓడించి సెమీస్ చేరింది.
అయితే ఇండియా మాత్రం గ్రూపు మ్యాచులు, సూపర్ 8 మ్యాచులు అన్ని గెలిచి సెమీస్ చేరుకుంది. అయితే గత టీ 20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై ఓడిపోవడం ఇండియాకు ఛేదు అనుభవం. దీంతో పగ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దెబ్బకు దెబ్బ కొట్టాలని టీం ఇండియా గట్టిగా అనుకుంటోంది.
దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంటోంది. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్, బట్లర్ మినహా మిగతా వారు పెద్దగా ఫామ్ లో లేరు. వీరిద్దరిని కట్టడి చేస్తే చాలు తక్కువ స్కోరుకే పరిమితం చేయొచ్చు. అయితే బౌలింగ్ లో టాప్లీ, మార్క్ వుడ్, జోప్రా ఆర్చర్ లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. అడిల్ రషీద్ స్పిన్ ను ఎదుర్కొవడానికి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సారి ఇంగ్లండ్ పై గెలిచి ఫైనల్ చేరడమే కాకుండా ప్రతీకారం తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.