![Furniture Thief](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/furniture-thief.jpg)
Furniture Thief Jagan: ఏపీలో కొత్త రాజకీయానికి తెర లేచింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేశాడన్న ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తన సోషల్ మీడియా లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. “ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు” అంటూ హైలెట్ చేసింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్ కి ప్రజల సొమ్ము మీద ఇంకా మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపాడు. పదవి పోయాక రూ.39 లక్షల విలువైన ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కానీ ఆయన ఇవ్వలేదు. ఇక ఇలాంటి వాడిని ఏమని అనాలి అంటూ జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసు ఫొటోలను పోస్ట్ చేశారు. నిన్న పార్టీ నేతలతో తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జగన్ సమావేశం ఏర్పాటు చేసిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. పార్టీ నేతలకు జగనన్న ఆత్మ స్తైర్యాన్ని నింపుతున్నారంటూ గర్వంతో పోస్టు చేసిన ఈ ఫోటోనే జగన్ ను ప్రజల ముందు ‘దొంగ’గా నిలబెట్టింది. బహుశా వైసీపీ నేతలు ఇంత రచ్చకు దారి తీస్తుందని గ్రహించి ఉండకపోవచ్చు.
అధికారంలో ఉన్నప్పుడు తానూ చేసిన పాపాలు తిరిగి తనకే తగులుతాయని ఊహించని జగన్ ఇప్పుడు ఈ ఫర్నిచర్ దొంగ అనే నిందను మోయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి మాజీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై ఫర్నిచర్ దొంగ అంటూ నిందలు మోపి.. తన రాజకీయ జీవితంలో చెరుపుకోలేని ముద్ర వేసుకున్నారు జగన్. ఆ అవమాన భారం మోయలేక మానసిక క్షోభతో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ కు చేసిన పాపం నీడలా వెంటాడిందా అన్నట్లుగా వైసీపీ అధికారం కోల్పోయిన ‘మూడు వారాలకే’ జగన్ అదే ‘ఫర్నిచర్ దొంగ’ అనే నిందను మోయాల్సి వచ్చింది. దీనితో కోడెల అభిమానులు జగన్ కు కాలం మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది, కోడెల ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని అంటున్నారు. ఈ రోజు టీడీపీ పెట్టిన పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ “ఫర్నిచర్ దొంగ”.. ఈ మాట ఎక్కడో విన్నట్లుంది కదా అంటూ టీడీపీ, జనసేన మద్దతుదారులు అటు జగన్ ను ఇటు వైసీపీ ని ట్రోల్ చేస్తున్నారు.