Lokesh Mahanadu : టీడీపీలో వర్గపోరు మళ్లీ మొదలైంది. అదికాస్తా మహానాడు వేదికగా బయట పడింది. ఎర్రం నాయుడి ప్రియ శిష్యుడు మహానాడులో టీడీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇది ఇప్పుడు టీడీపీతో పాటు వైసీపీలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వీడియో ఇప్పుడు ఏపీ అంతటా వైరల్ గా మారింది. టీడీపీ కేడర్ కు చెందిన వ్యక్తే యువరాజును ధూషించడం తీవ్ర దుమారానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే..
నందమూరి తారక రామారావు శక జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. విదేశాల నుంచి కూడా చాలా మంది టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించేందుకు టీడీపీ రాజమండ్రిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు వేడుకల్లో వర్గపోరు బయట పడింది. దీన్ని వీడియోలో బంధించిన కొందరు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
శ్రీకాకులం మాజీ ఎంపీ ఎర్రం నాయుడు ప్రియ శిష్యుడు వెంకట్ మహానాడుకు వచ్చాడు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి, యువరాజు లోకేశ్ ను ‘అరేయ్ లోకేశ్’ అంటూ సంబోదించాడు. దీంతో అక్కడున్న వారు ఆయనను అడ్డుకున్నారు. ఎందుకు యువరాజును అరేయ్ అని సంభోదిస్తున్నావంటే.. పార్టీలో ఉంటూ తాము తీవ్రంగా నష్టపోయామని ఎర్రం నాయుడు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే ఆయన పార్టీ కేడర్ ను పట్టించుకోవడం లేదంటూ ఎర్రన్నాయుడి శిష్యుడు వెంకట్ మహానాడు వేధికగా దుమారం చేశారు. కనీసం లోకేశ్ కూడా తమను పట్టించుకోవడం లేదంటూ ఆయన దుర్బాషలాడాడు.