Janhvi Kapoor :
బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ.. స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమె తన టాలెంట్ తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన తల్లి శ్రీదేవి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది..
నటన మాత్రమే కాదు అందాలను కూడా ఓ రేంజ్ లో ఆరబోస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక బాలీవుడ్ లో ఈ భామ ఒక వైపు వరుస సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా ఏలేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే సౌత్ లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. మరి అమ్మడి సౌత్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.. ఇదిలా ఉండగా జాన్వీ తాజాగా హైదరాబాద్ లో ఇల్లు కొనింది అనే టాక్ వైరల్ అయ్యింది. ఈమె దేవర సినిమా కోసం తరచు హైదరాబాద్ రావాల్సి వస్తుందట.
దీంతో ఈమె హోటల్స్ లో కూడా అడ్జెస్ట్ కాలేక పోతుందని అందుకే ఈమె ఇక్కడే ఒక ఇల్లు కొనింది అని తెలుస్తుంది. మరి ఆ ఇల్లు ఎంతో తెలుసా.. ఏకంగా 39 కోట్లు పెట్టి ఈ అమ్మడు ఇక్కడ లగ్జరీ హౌస్ కొన్నట్టు టాక్.. దీంతో ఈమె షూటింగ్ కోసం వచ్చినప్పుడల్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉండేట్టుగా ప్లాన్ చేసుకుందని సమాచారం..
ReplyForward
|