36.9 C
India
Sunday, May 19, 2024
More

    Wife & Husband : భార్య సెల్ఫీకి భర్త బలి..

    Date:

    Wife & Husband : యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి భార్య సెల్ఫీ భర్త ను బలి చేసింది. ఇంతకు ఆమె చేసిందేమిటో తెలుసా.. బెడ్ పై రూ. 500 నోట్లతో సెల్ఫీ దిగడమే.. ఆ కరెన్సీ మొత్తం రూ. 14లక్షలు.. దీంతో యూపీ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది.  ఈ ఫొటో సోషల్ మీడియాలో  వైరల్ కావడంతో పోలీసు శాఖలో కలకలం రేపింది.
    యూపీలోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌ ఎస్ఐ  రమేష్‌ చంద్ర సహాని. ఇటీవల సహాని భార్య, అతని పిల్లలు వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీతో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే అదికాస్త వైరల్ అయ్యింది. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో, రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు సహానిపై విచారణకు జరిపారు. సదరు ఎస్ ఐని  వెంటనే మరో ప్రాంతానికి  బదిలీ చేశారు.
    ఆ డబ్బు ఆస్తి విక్రయిస్తే వచ్చింది..
    రూ. 14 లక్షల విలువైన కరెన్సీని బెడ్‌పై పెట్టి..  ఆ నోట్ల కట్టల పక్కన సహానీ భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని సెల్ఫీ తీసుకున్నారు. ఇక, ఈ ఫొటోపై ఎస్‌ఐ సహాని వివరణ ఇచ్చారు. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నదని చెప్పుకొచ్చాడు.
    ఈ ఘటనపై పోలీసు అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. రమేష్‌ చంద్ర సహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నది నిజమే. ఎస్ఐ భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ చేపట్టాం.  ఆ ఫోటోలో ఎస్ఐ భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారి ని బదిలీ చేశాం. అతనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు. పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya:పుష్యమాసంలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ చేయవచ్చునా ? ముహూర్తం సరియైనదేనా?

    అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠనిన్న మధ్యాహ్నము 12:29...

    Chiranjeevi family in Ayodhya: అయోధ్య రామమందిరంలో… ప్రత్యేక ఆకర్శనగా నిలిచిన చిరంజీవి ఫ్యామిలీ

    దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయో ధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి...

    Ayodhya-Modi: అయోధ్య రాముడికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

    అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లాకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు....

    Ayodhya- Modi: అయోధ్యకు రాముడు వచ్చేసాడు..శతాబ్దాల కల నెరవేరింది..ప్రధాని మోడీ

                  అయోధ్య:రామ నామం అంటే అనంత పుణ్యమనే అర్థం అని ప్రధాని మోడీ...