![YSRCP](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/evm.webp)
YSRCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గోరపరాజయం పాలైనది. వైసీపీ భారీ విజయాన్ని అందుకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్లు అధికారంలో కొనసాగింది. ఐదేళ్ల పరిపాలనకు ఎంత నష్టాన్ని మూటగట్టుకోవాలో అంత నష్టాన్ని ప్రజలు వైసీపీ భుజాలపై పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చాలా నిజాయితీగా, చక్కటి సమాధానాన్ని సాంకేతిక పరంగా చంద్రబాబుకు, ఆయనకు ఓటువేసిన ప్రజలకు వివరించారు.
2019 ఎన్నికల్లో ఈవీఎం లల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అక్రమాలతోనే వైసీపీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందని కూడా ఆరోపించారు. ఓటమి తట్టుకోలేక చంద్రబాబు ఆ విదంగా వైసీపీ అధినేత పై ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్ గా జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కు ఈవీఎం లో ఓటు వేస్తె ఎలా ఉంటుందో కూడా తెలుపుతూ సాంకేతిక పరంగా వివరించారు. అంతేకాదు కేవలం నోటి మాటలతో చెప్పడంతో పాటు వీడియో రూపంలో కూడా చంద్రబాబుకు, ప్రజలకు వివరించారు. ఈవీఎం లలో ఎక్కడ కూడా అవినీతి జరుగలేదని వివరించారు. అంతేకాదు అంతగా దిగజారి చేయాల్సిన ఖర్మ కూడా తనకు లేదని సెలవిచ్చారు. కేవలం ప్రజలు మావైపు ఉన్నారు కాబట్టే మేము గెలిచి, అధికారం చేపట్టామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం విశేషం.
తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం విజయం సాధించి అధికారం చేప్పట్టబోతోంది. వైసీపీ ఇంటి దారి పట్టింది. 2019 లో ఈవీఎం ల గురించి చెప్పిన మాటలు, వీడియో చిత్రాలు వైసీపీ అధినేత తో పాటు నాయకులు మరచిపోయినట్టు ఉన్నారు. ఐదేళ్లకే ఇలా మరచి పోతే ఎలా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈవిఎం లల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి తెలుగు దేశం గెలిచింది. మేము ఓటమి పాలయ్యాం. మా పరిపాలన నచ్చక ప్రజలు తిరస్కరించారని మాత్రం మాట్లాడక పోవడం విడ్డురంగా ఉందనే ఆరోపణలు ఏపీ లో వ్యక్తం అవుతున్నాయి. 2019, 2024 ఎన్నికల్లో ఉపయోగించింది ఈవీఎం లే అయినప్పుడు అప్పుడు ఎలా గెలిచారు, ఇప్పుడు ఎలా ఓటమి పాలయ్యారని కూడా ప్రజలు వైసీపీ మతాల తీరుపై ప్రశ్నిస్తున్నారు.