India economy double : దేశ అర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఫాస్టెస్ట్ జీడీపీతో దూసుకెళ్తున్నది. భారత గణంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గ్రాఫ్ ప్రకారం 2023లో 7.2శాతం వృద్ధిని ఇండియా కనబరించింది. అయితే ప్రపంచంలోని అగ్రదేశాలను దాటుతూ ఇండియా ఈ వృద్ధిని సాధిస్తున్నది. ప్రస్తుత గ్రాఫ్ ప్రకారం ఇండియా అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తాజాగా ఇండియాలోని జాతీయ గణంకాల సంస్థ ఈ వృద్ధి రేటును ప్రకటించింది. ప్రస్తుతం మేజర్ ఎకానమీ దేశాల సరసన మన దేశం నిలిచిందని, ఇప్పుడు దాటి జీడీపీ సాధిస్తున్నదని తెలిపారు. ఈ సంస్థ విడుదల చేసిన గ్రాఫ్ లో ఇండియాలో జీడీపీ రేటు 702 శాతంగా చూపిస్తే, అభివృద్ధి చెందిన దేశాలైన యూకేలో 4.1 శాతం, చైనాలో 3 శాతం, యూఎస్ లో 2.1 శాతంగా ఉంది. గతేడాది నుంచి ఇండియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించింది. కొవిడ్ పరిణామాల అనంతరం ఇండియా కోలుకొని సుస్థిర ఆర్థికాభివృద్ధి వైపు సాగుతున్నది. పలు దేశాలు కొవిడ్ విపత్తు సృష్టించిన నష్టాన్ని దాటలేక ఇంకా కొట్టుమిట్టాడుతున్నాయి.
ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించింది. రానున్న పదేళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటిగా నిలవడం ఖాయమనే అభిప్రాయం ఆర్థిక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా వృద్ధి రేటును చూస్తే ఇది అర్థమవుతున్నదని వెల్లడించారు. ఇండియాలో వచ్చిన ఆర్థిక సంస్కరణలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలో మరే దేశం సాధించలేని ఘనతలను ఇండియా సాధించబోతున్నదని వారు స్పష్టం చేశారు.