Jaganannaku chebudam : ‘ఇదే ప్రభుత్వంరా’ నాయనా.. అంటున్నారు ఏపీ టీడీపీ నాయకులు. ప్రజా సమస్యలను వారు పట్టించుకోరు, మమ్మల్నీ ప్రశ్నించనీయరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయాలు మరింత జఠిలంగా మారాయి. టీడీపీ పాలకులు ఎక్కడ ఉంటే అక్కడ గృహ నిర్భందం చేయడం లేదా అరెస్ట్ చేసి జైలులో వేయడం. ఇదే పోలీసులకు రోజు వారి కార్యక్రమంగా మారిందని ఏపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
శాంతియుతంగా కూడా నిరసనలు తెలపకుండా కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఇక ప్రైవేట్ కార్యమాలకు అస్సలు అనుమతి ఇవ్వడం లేదు మరొక అడుగు ముందుకు వేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అస్సలు వెళ్లనీయడం లేదు. ఏపీలో వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. ఎక్కడో ఒక చోట టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వెళ్లకుండా గృహ నిర్భందం చేస్తున్నారు పోలీసులు. ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరుతున్న పాయకరావుపేట ఎమ్మెల్యే, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు గృహ నిర్బంధం విధించారు. దీనిపై ఆమె కూడా స్పందించారు.
ఇటీవల వైసీపీ ప్రభుత్వం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం తీసుకువచ్చింది. అయితే తమ పరిధిలోని సమస్యలను ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకు ఇస్తే వారు పరిష్కారం చూపిస్తారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తను ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుంటే పోలీసులు ఆమెకు గృహ నిర్బంధం విధించారు. ‘జగనన్నకు చెబుదాం అని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటారు. తీరా సమస్యలు చెప్పుకోడానికి వస్తుంటే భయపడి పోలీసులను పంపి అడ్డుకుంటాడు.’ అంటూ ఆమె పోలీసులపై మండిపడ్డారు.
జగనన్నకు చెబుదాం అని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటారు. తీరా ప్రజలు సమస్యలు చెప్పుకోడానికి వస్తుంటే భయపడి పోలీసులను పంపి అడ్డుకుంటాడు. ప్రజా స్పందన కార్యక్రమంలో ప్రజల సమస్యలను అధికారులకు చెబుదామని బయలుదేరిన తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణం… pic.twitter.com/KNIdP4Gk6s
— Telugu Desam Party (@JaiTDP) October 11, 2023