Jai NTR. Jai Ublood : డా. జై యలమంచిలి స్థాపించిన ‘యూ బ్లడ్ (నోబుల్ టూ సేవ్ లైఫ్)’ను కొత్త నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఒకరి రక్తం మరొకరికి ప్రాణం’ అంటూ ఆయన స్థాపించిన ఈ సంస్థ ద్వారా వేలాది కుటుంబాలు నేడు ధీమాగా ఉన్నాయి. యూ బ్లడ్ ను స్థాపించినప్పటి నుంచి తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది నుంచి సేకరించిన బ్లడ్ ను కష్టాల్లో ఉన్న వారికి అందజేసి ప్రాణాలను కాపాడుతున్నారు జై యలమంచిలి గారు.
అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘జై ఎన్టీఆర్-జై యూబ్లడ్ (Jai NTR Jai Ublood )’ అంటూ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వినిపిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సహా మహానాడుకు వచ్చిన చాలా మంది జై యలమంచిలి స్థాపించిన యూ బ్లడ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. చాలా మంది తాము కూడా బ్లడ్ డొనేట్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్తున్న జై యలమంచిలి అందరి సేవలను తప్పకుండా వినియోగించుకుంటానని హామీ ఇచ్చారు.
‘జై ఎన్టీఆర్-జై యూబ్లడ్’ నినాదం ఇప్పుడు ప్రజల్లోకి లోతుగా వెళ్తోంది. తన సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృత పరచాలనుకుంటున్నారు జై యలమంచిలి. దీనికి తగ్గట్లుగా షెడ్యూల్ ను కూడా తయారు చేసుకున్నారు. మరింత మంది సహకారాన్ని యూ బ్లడ్ లో వాడుకోవాలని ఆయన చూస్తున్నట్లు తెలుస్తోంది. రక్తం అనేది ఏదో ఒక విధంగా అవసరం అవుతూనే ఉంటుంది. సికిల్ సెల్ ఏనీమియా ఉన్నవారికి దాదాపు నెలలో ఒక సారి రక్తం అవసరం అవుతుంది. ఇంకా యాక్సిడెంట్లు, ఆపరేషన్లు ఇలా రక్తం అన్ని సమయాల్లో కావాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ యూనిట్లను సేకరించాలి. అందుకే యూ బ్లడ్ సంస్థ ఎక్కువ మందికి అవగాహన కల్పిస్తూ పేదలకు సేవ చేస్తూ తామున్నామంటూ చెప్తోంది.