JPS on strike again : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వానికి మధ్య పంచాయతీ తెగడం లేదు. ప్రొహిబిషన్ పీరియడ్ ముగిసినా తమను పర్మినెంట్ చేయడం లేదని పంచాయతీ కార్యదర్శులు అంటుంటే టెంట్ల కింద ఎండలో ఎందుకు కూర్చోవడం ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటూ ప్రభుత్వం అంటూ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. దీంతో భయపడ్డ పంచాయతీ కార్యదర్శులు తిరిగి ఉద్యోగంలో చేరారు. తమ న్యాయమైన సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని, చివరికి నిరసనకు దిగితే అల్టిమేటం జారీ చేయడం సరికాదని వాపోతున్నారు. ప్రభుత్వం పట్టింపులేని తనంతో ఎన్నాళ్లయినా గొడ్డు చాకిరీ తప్పదని భావించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తిరిగి మళ్లీ సమ్మెకు దిగారు. ప్రభుత్వం మెడలు వంచైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారు.
కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. సమ్మె, నిరసనలు, ధర్నాలు ఆపాలంటే అందరినీ కన్విన్స్ చేయడం కంటే లీడర్ ను పట్టుకుంటే చాలని భావిస్తున్నారు. కార్మిక సంఘాల యూనియన్ల నాయకులు దాదాపు బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నుంచే ఉన్నారు. గతంతో ఆర్టీసీ సమ్మె, విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఇలా ఏ శాఖ తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఉద్యమం బాట పడతారో వారి నాయకుడిని కన్విన్స్ చేస్తే చాలా ఉద్యమం ఆగిపోతుందని అందుకు తగ్గ ప్లాన్ చేస్తారు. చలా వరకు ఇలా కార్మిక సంఘాల నాయకులకు తాయిలాలు ఇచ్చి ఉద్యమాలపై నీళ్లు చల్లిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఆరోపణలు లేకపోలేదు. ఈ జేపీఎస్ పంచాయతీని కూడా అలాగె తెగ్గొట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరవున్నా కొద్దీ నిరసనలు, ధర్నాలు లేకుండా చూడాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జేపీఎస్ లకు ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి. అల్టిమేటాలను తలవంచేది లేదని జేపీఎస్ లు అంటుండగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇలా విపక్షాలు జేపీఎస్ ల వెంట నిలుస్తున్నాయి. వారి న్యాయమైన కోర్కొలు తీర్చే వరకూ వారితోనే ఉంటామని తేల్చి చెప్తున్నాయి. వారి ఉద్యమ కార్యాచరణతో పాటు తాము కూడా వారి కోసం కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ జేపీఎస్ ల కోసం ఉద్యమం ప్రకటించారు. జిల్లా కార్యకర్తల నుంచి గల్లీ కార్యకర్తలు వరకూ ప్రతీ ఒక్కరూ జేపీఎస్ ల తరుఫున నిల్చోవాలని పిలుపునిచ్చారు.