- ఓడిన ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్
KTR : అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ కోసం పోరాడేదీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ మాటలకు అంతే ధీటుగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఓడిన ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ నేతలు అటాక్కు దిగారు.
కాంగ్రెస్కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానుందుకు బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న అభిమానం ఏ మాత్రం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ కోసం పోరాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలిచిందని, ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.