చంద్రబాబును రజనీకాంత్ పొగడడమే వైసీపీ శ్రేణులు జీర్ణీంచుకోలేకపోతున్నారు. రజనీ కాంత్ పై విమర్శల దాడి పెంచారు. దీనీపై ఏపీ మంత్రులు కూడా స్పందించారు. రజనీ కాంత్ చంద్రబాబు రాసిచ్చిన స్కిప్ట్ ను చదవారని, చంద్రబాబు తన గొప్పలను రజనీతో చెప్పించుకున్నారని ఎద్దెవా చేశారు.
తాజాగా ఏన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి సైతం రజనీకాంత్ లక్ష్యంగా పలు అంశాలను ప్రస్తావించారు. అనాడు చంద్రబాబు ఏన్టీఆర్ ను వెన్నుపొటు పొడిచిన సమయంలో రజనీకాంత్ ఆయనకు అండగా నిలబడ్డారని ఆరోపించారు. రజనీకాంత్ కు ఏన్టీఆర్ పట్ల గౌరవం ఉంటే చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినాలని సూచించారు. చంద్రబాబుకు వెన్నుపొటు సమయంలో అండగా నిలిచిన రజనీపై అప్పట్లో ఆయనపై పత్రికలు తీవ్రంగా విమర్శలు చేశాయని గుర్తు చేశారు. తర్వాత కాలంలో ఆయనను కలిసి క్షమించమని అడిగారని కీలకం అంశాలను బయటపెట్టారు లక్ష్మీ పార్వతి.
జగన్ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక ఇలా డ్రామాలు అడుతున్నారని ఎద్దెవా చేశారు.ఇంట్లో అంత మంది హీరోలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదని, బయటి నుంచి ఇంకో హీరోను తీసుకొని వచ్చి బాబుపై గొప్పలు చెప్పించారని మండి పడ్డారు. ఎంత మంది హీరోలు వచ్చి చెప్పిన జగన్ ను ఏమి చేయలేరని అన్నారు.