Mortuary : ఒడిశా రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని ఖరీదు ప్రాణాలే కావడం గమనార్హం. ఎటుచూసినా హాహాకారాలే. రైలు ప్రమాద సంఘటన చూసిన ప్రతి వారి గుండె ఝళ్లుమంది. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది. ఈనేపథ్యంలో ఎంతోమంది క్షతగాత్రులుగా మిగిలారు. మరి కొంత మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశా ప్రమాదం కనీవినీ ఎరుగని రీతిలో చోటుచేసుకుంది. రాత్రి వేళ ఏం జరుగుతుందో తెలియదు కానీ పెద్ద శబ్ధం మాత్రం వచ్చింది. దీంతో అక్కడ ఏం జరిగిందో తెలియక ముందే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో బెంగాల్ ప్రయాణికుడు బిశ్వజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్య సిబ్బంది వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.
రెండు రోజుల తరువాత వారు వచ్చి పరిశీలించగా అతడు బతికే ఉన్నాడు. దీంతో వారు అప్రమత్తమై వైద్యులకు సూచించగా వారు చికిత్స చేసి బతికించారు. కనీసం ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలుసుకోకుండా చనిపోయాడని నిర్ధారించుకోవడం దారుణం. దీనిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బతికున్న వాడినే చనిపోయాడని అనుకోవడం అంటే వారి నిర్లక్ష్యమే తప్ప అందులో ఏం లేదు. కానీ వైద్య సిబ్బంది తీరు హాస్యాస్పదంగానే మారింది. బతికున్న వాడిని శవంగా చేసే సత్తా వారికి దక్కుతోంది. వారి తీరు పలువురిని విమర్శలు చేసేలా చేస్తోంది. ప్రాణాలతో ఉన్నవాడిని మార్చురీకి తరలించి వారిలో మానవత్వం లేదని నిరూపించారు.