- నల్లగొండ జిల్లా పగిడిపళ్లి వద్ద నిలిపివేసి మంటలను ఆర్పుతున్న సిబ్బంది.
- ప్రమాదమా.. విద్రోహమా?
Falak Numa Super Fast Express train : ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. హౌరా నుంచి ఫలక్ నుమా ట్రైన్ సికింద్రాబాద్ కు వెళ్తుండగా భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మార్గంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో రైలులోని ఆరు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. వెంటనే రైల్వే సిబ్బంది గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం తప్పింది.
కాగా రైలులోని చార్జింగ్ పాయింట్ వద్ద ఓ వ్యక్తి సిగరేట్ తాగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ప్రమాదం వెనుక షార్ట్ సర్య్యూట్ కారణమా? లేదంటే విద్రోహ చర్య అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత నాలుగు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది.
హైదరాబాద్ టూ ఢిల్లీ రూట్లో వెళ్లే ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ఆ లేఖలో వార్నింగ్ ఉండటంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.