Train accident site : భారత్ అంటే సనాతన దేశం.. ఇక్కడ మత విశ్వాసాలు ఎక్కువనే చెప్పాలి. మొన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో సమీపంలో ఉన్నది ఏంటి.. గుడా..? లేక మసీదా..? అన్న అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి. పూజా స్థలమైనా, ప్రార్థనా స్థలమైనా ప్రమాదం అన్నప్పుడు ఏమీ చేయలేము కదా..? అయితే ఈ ఘటన చుట్టూ ఉగ్రకోణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇంత పెద్ద రైలు ప్రమాదానికి కారణం కావాలని సీబీఐ ఎంక్వయిరీ కూడా వేసింది.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన నేపథ్యంలో కొన్ని రకాల మత మూఢ్యాలు బయల్దేరాయి. వీరి వల్లే ప్రమాదం జరిగిందని కొందరంటే.. లేదు లేదు వారి వల్లే ప్రమాదం అంటూ మరికొందరు అంటున్నారు. అసలు సిగ్నల్ వల్ల అని ఇప్పటి వరకు ప్రాథమికంగా తెలిసినా వీటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే, ఒడిశా రాష్ట్రంలోని, బాలేశ్వరం జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇందులో ఇప్పటి వరకు 278 మంది మరణించారు. ఇంకా వెయ్యికి పైగా మంది క్షతగాత్రులయ్యారు.
అయితే ఇక్కడ ఉంది ఏంటంటూ..? సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని గురించి తెలుసుకుందాం. బాలేశ్వరం జిల్లాలో ప్రమాదం జరిగిన స్థలానికి కొంత దూరంలో రెండు వర్గాల విశ్వాసాలకు చెందిన ప్రార్థనా స్థలం, గుడి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రసిద్ది చెందిన ఇష్కాన్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగే ఒక గుడి ఉంది. అది కొంత దూరంలో ఉండగా.. ఒక వర్గానికి సంబంధించిన ప్రార్థనా స్థలం కూడా ఉంది. ఈ రెండు కూడా తక్కువ డిస్టన్స్ లోనే ఉన్నాయి.
ఎన్ని గుడులు ఉన్నా.. ఎన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నా.. ప్రమాదాన్ని ఆపలేవుకదా.. అసలు ప్రమాదం జరిగింది సిగ్నల్ వల్లా, లేక ట్రైన్ డ్రైవర్ వల్లా అని పరిశీలిస్తున్నారు. ఇందులో సిగ్నల్ లోపం అంటూ ప్రాథమికంగా తేల్చినా.. పూర్తిగా తేల్చేందుకు సీబీఐతో ఎంక్వయిరీ కూడా వేసింది కేంద్రం. గుడులైనా.. ప్రార్థనా స్థలాలు అయినా ప్రమాదాలను ఆపలేవు కదా..?