Trains canceled : విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలోని నడిచే ఎనిమిది రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య ఈ తెల్లవారు జామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో కొన్ని మీటర్ల వరకు పట్టాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపడుతున్నారు.
Breaking News