MP Raghu Ramaraju Mimicry : అన్న ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతి అందరికీ తెలుసు. టీడీపీ పై పెత్తనం చెలాయించాలని చూసి భంగపడిన ఆమె, ఆ ఆర్వాత అన్నాటీడీపీ అని పెట్టారు. కానీ నెగ్గుకురాలేకపోయారు. ఇక కొంత కాలం క్రితం వైసీపీలో చేరి చంద్రబాబు మీద విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యుల మీద ఎప్పుడూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇక జగన్ వచ్చాక ఆమెకు ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. దీంతో చంద్రబాబు పై మరింతగా విరుచుకుపడుతుంటారు. అన్న ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ పదే పదే ఆరోపిస్తుంటారు.
ఇక తాజాగా చంద్రబాబును అరెస్ట్ చేసి, విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఏపీ సీఐడీ తరలించంద. అయితే ప్రస్తుతం ఏసీబీ, ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వివిధ పిటిషన్లు విచారణ లో ఉన్నాయి. దీనిపై లక్ష్మీ పార్వతి స్పందిస్తూ చంద్రబాబు తన న్యాయవాదుల కోసం ఈ 40 రోజుట్లో సుమారు 2వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా వైసీపీలో రెబల్ గా ఉన్నారు. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కూడా. అయితే లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇక ఆమె వాయిస్ ను మిమిక్రీ చేస్తూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 40 రోజులకే చంద్రబాబు అంత ఖర్చు చేస్తే, మరి పదేళ్లుగా బెయిల్ పై ఉన్న ఏపీ సీఎం జగన్, అంతకుముందు వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగిన జగన్ ఎంత ఖర్చు చేశారో చెప్పాలని వ్యంగ్యంగా మాట్లాడారు. సుమారు 40వేల కోట్లు ఖర్చు చేశారంటూ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి వాయిస్ ను ఆయన మిమిక్రీ చేయడంతో ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్నవారంతా నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అవుతున్నది.