NTR & ANR :
ఇప్పటి జనరేషన్ లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ వుడ్ అయినా సరే హీరో కేంద్రంగా సినిమాలు తీస్తున్నారు. ఏ మూవీ తీసుకున్నా హీరో మేయిన్ రోల్.. లేదంటే హీరోయిన్ (లేడీ ఓరియంటెడ్).. కథ పెద్దగా సినీ ప్రేక్షకులకు ఎక్కకున్నా ఏదో అయిపోయిందిలే అని పిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హీరో కావాలి.. ఆయన డేట్స్ కోసం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా వేచి ఉండాల్సిందే. ఇక ఇందులో ఇంకో విషయం ఏంటంటే సినిమాలో కథ.. కథనం.. ఎలా ఉన్నా పలానా హీరో అయితే చాలు రికార్డులు తిరగరాయాల్సిందే. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ కథ విషయంలో పూర్తి నెగెటివ్ కామెంట్లు తెచ్చుకున్నా.. ఓన్లీ ప్రభాస్ ఇమేజ్ పై ఇప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.
ఇదంతా పక్కన పెడితే గతంలో సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో లేకపోయినా హీరో మంచి కథ, ఆకట్టుకునే కథనంతో సాగిపోయేవి. కుటుంబం అంతా కలిసి మంచి ఎంటర్ టైన్ మెంట్ అనుభవించేవారు. వారు చేసిన సినిమాలు ఇప్పటి మూవీస్ తో పోల్చుకుంటే మరింత గొప్పవని చెప్పవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చిన్న చిన్న ఇష్యూష్ వస్తేనే గోల గోల చేసే హీరోలు కనిపిస్తున్నారు. కానీ ఆ జమానాలో మహానటుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు ఇలాంటి చాలా ఇష్యూస్ ను సర్ధుకొని పోయేవారు.
ఎన్టీఆర్, ఎఎన్ఆర్ జమానాలో దర్శకుడు కేంద్రంగా సినిమాలు సాగేవి. సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా దర్శకుడే అన్నీ. హీరోలు కూడా వారు గీసిన గీతను జవదాటకపోయేవారు. ఇక అగ్ర తాంబూలం గురించి చూసుకుంటే దాదాపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చివరి రోజులు వచ్చే వరకు ఎంతో కొంత మారినా.. వారు ఇండస్ట్రీలో ఉన్న సమయంలో అయితే దర్శకులకు అత్యంత గౌరవం ఇచ్చేవారు. ఒక రోజు కూలి డబ్బుల కోసం దర్శకుల వద్దకు వెళ్లి అడిగేవారు.
ఇలాంటి ఒక అరుదైన చిత్రం ఇక్కడ కనిపించింది. బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి కుర్చీలో కూర్చోగా వారి ముందు నేలపై కూర్చొని రోజువారి కూలి డబ్బుల కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ యాక్టర్స్ ఎదురి చూస్తున్నారు. ఇలాంటి అరుదైన చిత్రం ఇప్పటి హీరోలు, దర్శకులకు మార్గదర్శనం చేస్తుందా? చూడాలి మరి.