Asia Cup 2023 :
ఆసియా కప్ లో కీలక మ్యాచ్ గురువారం జరగనుంది. సూపర్ 4 దశలో జరుగుతున్న ఈమ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టు ఫైనల్ కు చేరనుంది. ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ తో ఈ జట్టు తలపడనుంది. సూపర్ 4 లో భాగంగా శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య ఈ ఉత్కంఠ పోరు జరగనుంది. సూపర్ 4 జట్లలో బంగ్లాదేశ్ ఇప్పటికే వరుసు ఓటములతో ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.
అయితే శ్రీలంక, పాకిస్థాన్ జట్లలో విజేత ఫైనల్లో భారత్ తో తలపడనుంది. ఇప్పటికైతే రన్ రేట్ పరంగా శ్రీలంక ముందంజలో ఉంది. ఒకవేళ వర్షం పడితే ఈ రన్ రేట్ తో శ్రీలంక ఫైనల్ కు వెళ్లే చాన్స్ ఉంది. అయితే రెండు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో గెలిచేదెవరో మ్యాచ్ లో తేలనుంది. అయితే కొలంబోలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక జట్టుకు అదనపు ప్రయోజనం ఉంది. ఇక పాక్ జట్టు ప్రదర్శన పరంగా వెనుకబడి ఉంది.
ఇక శ్రీలంక విషయానికొస్తే బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ లలో శ్రీలంక బలంగా కనిపిస్తున్నది. మెలలాగే, అసలంకచ తీక్షణ, కుశాల్ మెండిస్, నిసాంక, సమర విక్రమ, ధనుంజయతో పాటు కెప్టెన్ షనక ప్రదర్శనను పాక్ జట్టు అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల ప్రదర్శనపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇరు జట్లు 155 సార్లు తలపడితే 92 మ్యాచుల్లో పాకిస్థాన్, 58 మ్యాచ్ లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచ్ లు రద్దయ్యాయి. ఇక గురువారం జరిగే మ్యాచ్ సెమీఫైనల్ స్థాయి కావడంతో ఇరు జట్లు అమీతుమి కి సిద్ధమయ్యాయి. గెలిచి ఫైనల్ కు చేరాలనే లక్ష్యంతో బరిలో కి దిగుతున్నాయి.