2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగా స్టార్ చిరంజీవి పార్టీలో యువరాజ్యం అధ్యక్షునిగా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి న పవన్ కళ్యాణ్ తదనంతరం పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరంజీవి కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేయడం నచ్చడం పవన్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నించానికే జనసేనా అని స్లోగన్ ఇచ్చారు.
తరువాత జరిగిన ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయకుండా భేషరుతుగా బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత నాలుగెళ్లు సాగిన మైత్రి బంధంను చంద్రబాబు తెంచుకున్నాడు. తరువాత 2019 ఎన్నికల్లో ఓంటరిగా పోటీ చేసిన జనసేనకు ఒకే ఒక ఎమ్మెల్యే సీటు దక్కింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. మళ్లీ ఎన్నికల తరువాత బీజేపీతో మైత్రి బంధాన్ని కొనసాగించారు పవన్ …
అయితే సొంతంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీకి పవన్ భారీ ఝలక్ ఇచ్చారనే చెప్పవచ్చు. బీజేపీ ఏపీలో ఎదిగితే తాను నాలుగో స్థానానికి పడిపోతాననే భావనలో ఉన్న పవన్ బీజేపీతో మిత్ర పక్షంగా ఉంటూనే తన పార్టీని విస్తరించుకునే పనిలో సక్సెస్ అయ్యారు. మోడీ , అమిత్ షాలతో భేటీ కావడం తప్ప వాళ్లు పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం, బీజేపీతో దోస్తీ కొనసాగిస్తూ టీడీపీ వైపు అడుగులు వేయడంతో బీజేపీ ముందుగానే ఉహించి బీజేపీ, సొంతంగానే పార్టీని బలోపేతం చేసుకోవాలని కార్య క్రమాలు చేపడుతూ ప్రభుత్వం పోరాటాలకు సిద్ధం అయింది.
అయితే పవన్ ఒక్క విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదేమిటంటే పవన్ ను అడ్డం పెట్టకుని ఎదగాలనుకున్న బీజేపీకి అదిలోనే పవన్ అడ్డుకట్ట వేశారంటున్నారు. వైసీపీ, టీడీపీలకు పాటు బీజేపీ ఎదిగితే జనసేన నాలుగో స్థానికి పరిమితమవుతుందని భావించిన ఇది తన పార్టీకి నష్టం కలుగుతుందని భావించి బీజేపీకీ దూరంగా ఉండి మళ్లీ చంద్రబాబు వైపు చూస్తున్నారని ప్రచారం. ఈ ఏడాది జరుగనున్న ఎన్నికల్లో తన పార్టీకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోవాలని భావిస్తన్నట్లు సమాచారం.