38.1 C
India
Sunday, May 19, 2024
More

    Special Parliament Sessions : కొత్త పార్లమెంట్ లో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. మోదీ ప్రకటన

    Date:

    PM Modi's remarks at the start of Special Session of Parliament
    PM Modi’s remarks at the start of Special Session of Parliament

    Special Parliament Sessions :

    ఢిల్లీలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా పాత పార్లమెంట్ ప్రస్థానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమైంది. అయితే లోక్ సభ ప్రారంభంలోనే టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో కొంత గందరగోళం నెలకొంది. కాగా, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఎంపీలు, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కొత్త భారత్ ను కొత్త పార్లమెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తానని ప్రకటించారు.  చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిదని అభిప్రాయపడ్డారు. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం.  75 ఏండ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైందని పేర్కొన్నారు. కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఇక చంద్రయాన్ 3 విజయవంతంతో మనమెంటో ప్రపంచానికి తెలియజేప్పామని అభిప్రాయపడ్డారు.

    సమష్టి కృషి వల్లే జీ 20 సదస్సు విజయవంతమైందన్నారు.  ఈ సందర్భంగా మోడీ పార్లమెంట్ లో ఈ విధంగా మాట్లాడారు. జీ20లో అఫ్రికా యూనియన్ ను భాగస్వామిని చేశాం. జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు కొనియాడారు. భారత్ సత్తా వారికి తెలిసింది. భారత్ పురోగతిని ఇప్పుడు ప్రపంచమంతా కొనియాడుతున్నది. ఆధునిక భారత్ దిశగా దేశం అడుగులు వేస్తున్నది. అనేక రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందిందని మోదీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఆయన కోరారు. పాతపార్లమెంట్ లో ఇది చివరి సమావేశమని, రేపటి నుంచి కొత్త పార్లమెంట్ లోకి మారబోతున్నామని తెలిపారు.వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోతుండడం ఆనందంగా ఉందని చెప్పారు. భారత కీర్తి పతాక మరోస్థాయికి వెళ్లిందని అభిప్రాయపడ్డారు.

    భారతీయుల స్వేదం, డబ్బుతో ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించాం. ఈ పార్లమెంట్ భవనం అందరినీ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. దేశం అభివృద్ధికి చిహ్నంగా ఇది నిలవబోతున్నది. పాత పార్లమెంట్ కు వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తున్నది. పాత పార్లమెంట్ ను ప్రజల సందర్శనార్థం తెరిచే ఉంచుతాం. ఇక నయా భారత్ ను ప్రజల ముందుంచబోతున్నాం. భారత్ నిర్మాణాన్ని అందరం ఘనంగా చెప్పుకోవాలి. కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం దేశ ప్రజలందరికీ నిరంతర ప్రేరణలా ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sonia Gandhi : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీ..

    Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ రాజ్యసభ స...

    Parliament Budget: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. 19 బిల్లులకు ఆమోదం?

      నేటి నుంచి డిల్లీ లో  పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుత...

    MP GORANTLA MADHAV: గోరంట్ల ‘ఇంగ్లీష్’ మరీ.. చూసి నవ్వకుంటే ఒట్టు మరీ

    తేట తెలుగు తేనే లొలుకు అంటారు. మనం పుట్టింది పెరిగింది తెలుగులోనే...

    PARLIAMENT : పార్లమెంట్ దాడి కేసులో సంచలన నిజాలు

    నిన్న పార్లమెంటు పై జరిగిన కలర్ స్మోక్ ఘటనలో సంచలన  విషయాలు...