Gaddar Passed Away : ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. వివిధ రాజకీయ పార్టీలకు సంఘీభావం తెలుపుతూ అందరికీ చిరపరిచితుడైన ఈ విప్లవ గాయకుడు ఇక లేరు. గత కొంతకాలంగా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.
గద్దర్ కు కొద్దిరోజుల కిందట గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను అమీర్ పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. పలువురు ప్రముఖులు సైతం గద్దర్ ను పరామర్శించారు. ఇంతలోనే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు.
ప్రజా యుద్ధనౌకగా గద్దర్ పేరొందారు. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు.
మెదక్ జిల్లా తుఫ్రాన్ లో 1949లో గద్దర్ జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్ కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. తప్పించుకున్న ఆయన తర్వాత వివిధ పార్టీల తరుఫున ఎన్నికల్లో పోటీ చేశారు. గెలవలేకపోయారు. ప్రస్తుతం వృద్ధాప్యంతో కన్నుమూశారు.