టాలీవుడ్ కు మొదటి సారి ఆస్కార్ తెచ్చిపెట్టిన రాజమౌళి ఇప్పటి వరకూ తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టరేనని ఘంటాపథకంగా చెప్పవచ్చు. వందల ఏళ్ల సినీ చరిత్రలో బాహుబలితో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు దృష్టి పెట్టిందంటే క్రెడిట్ గోస్ టూ జక్కన్నే.
అందరు డైరెక్టర్లు నెలల్లోనే సినిమాపూర్తి చేస్తే రాజమౌళి మాత్రం సంవత్సరాల కాలం తీసుకుంటాడు. సినిమాను శిల్పం చెక్కినట్లు చెక్కుతారు కాబట్టి ఆయనకు ఇండస్ట్రీ టాలీవుడ్ జక్కన్న అని పిలుస్తుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే..
రాజమౌళి కుటుంబం మొత్తం చిత్ర సీమకు సేవలు చేస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన భార్య రమా రాజమౌళి, వదిన శ్రీవల్లి, అన్న కీరవాణి, తండ్రి విజయేంద్ర ప్రసాద్, కొడుకు కార్తికేయ వీళ్లంతా రాజమౌళి తీసే సినిమాలో భాగస్వాములు. కాబట్టి ఆయన తీస్తున్న ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో భారీ కలెక్షన్లు సాధిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తీసే ప్రతీ సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు సినిమాకు వచ్చే ప్రాఫిట్ లో వాటా కూడా తీసుకుంటారు. బాహుబలి సినీస్ కు రూ. 100 కోట్ల వరకూ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇక ఆస్కార్ అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’కు రెమ్యునరేషన్, ప్రాఫిట్ మొత్తం కలిపి రూ. 200 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. దానికి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా తర్వాత ఆయన సొంత కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ తీయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల నుంచి టాప్ స్టార్లను ఎంచుకుంటారట. ఆ దిశగా ఇప్పటి నుంచి కసరత్తు కూడా మొదలు పెట్టినట్లు చిత్ర వర్గాలు చెప్తుండగా ఈ సినిమాకు ప్రొడ్యూసింగ్ చేసేందుకు ఇప్పటికే చాలా సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియా వైజ్ గా టాప్ స్టార్లతో సినిమా తీస్తున్నాడు కాబట్టి పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవుతుంది. రెమ్యునరేషన్, ప్రాఫిట్ లతో కలిసి చాలానే సంపాదించవచ్చని జక్కన్న అంచనా వేస్తున్నారు.