Mahesh Babu : అనౌన్స్ చేసిన డేట్ రోజే (జనవరి 12) ‘గుంటూరు కారం’ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మేజర్ థియేటర్స్ ను బ్లాక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశాభావంతో ఎదురు చూస్తున్నాయి. ఈ సినిమా ముగిసిన వెంటనే టాలీవుడ్ జక్కన్న రాజమౌళిలో సినిమా చేయనున్నాడు మహేశ్ బాబు. ఈ సినిమాకు సంబంధించి గతంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని వార్తలు కూడా వచ్చాయి. నటుల ఎంపిక కొనసాగుతుందని, మరి కొన్ని రోజుల్లో పూర్తి క్రూను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దు గుమ్మను తీసుకోవాలని జక్కన్న పట్టుబడుతున్నారట.
ఈ సినిమా మార్చి, 2024లో ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ తో స్టోరీ కొనసాగుతుందట. మూవీకి కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నట్లు మనకు ఇది వరకే తెలుసు. హీరోయిన్ పాత్ర కూడా హీరోకు తగ్గకుండా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక, ఈ మూవీని పాన్ ఇండియా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ హీరోయిన్ కోసం.. దర్శకుడు తెగ వెతుకుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్ట్ చేయాలని బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకను జక్కన్న రెండు సార్లు కలిసి కథ చెప్పినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం.