Rajamouli : హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం.. ఇప్పటి వరకు బాలీవుడ్ సైతం ఊహించని కలెక్షన్లను కాబట్టడం తెలుగు ఇండస్ట్రీలో ఒక్క రాజమౌళికి మాత్రమే తక్కుతుంది. ఇలా ఒకటి, రెండు భారీ ప్రాజెక్టులతో తెలుగు ఇండస్ట్రీలోకి ఆస్కార్ ను తీసుకురాగలిగాడు. ఇండియన్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా సినిమాను పరిచయం చేసింది రాజమౌళి అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఇలాంటి సినిమాలు ఉన్నా.. అవి కేవలం ఒకే ఇండస్ట్రీ (భాష) లో రికార్డులు దక్కించుకుంటే మరో ఇండస్ట్రీలో (డబ్ చేస్తే) అంతగా రాణించలేకపోయింది. కానీ బాహుబలి 1, 2 ఆర్ఆర్ఆర్ అన్ని భాషలతో పాటు విదేశాల్లో కూడా సంచలనంగా మారింది. వీటిని పరిశీలించిన సినీ విశ్లేషకులు రాజమౌళిని హాలీవుడ్ స్థాయి డైరెక్టర్ సరసన నిలిపారు. కానీ ఇప్పుడు ఆయనను ప్రశాంత్ నీల్ భయపెడుతున్నారట.
ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆయన హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నారట. ఈ మూవీతో హాలీవుడ్ డైరెక్టర్ల సరసన కుర్చీ వేసుకొని కూర్చుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత కీర్తి సంపాదంచుకున్న రాజమౌళికి కొంత అపకీర్తి కూడా ఉంది. ఆయన ఏదైనా మూవీ తీస్తే దాని కోసం మూడు నుంచి నాలుగేళ్లు వెచ్చిస్తారు. దీని కోసం హీరో కూడా నాలుగేళ్లు మరే సినిమా కమిట్ కావద్దన్న నిబంధన విధిస్తారు. ఎందుకంటే ఆయన సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించాలని కోరుతారు.
రాజమౌళి కండీషన్ వల్ల హీరోలు మూడేళ్లు లేదంటే నాలుగేళ్లు ఒకే సినిమాపై పని చేయాలి. ఇది రాజమౌళికి కొంత సవాల్ గా మారనుంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీస్ సంవత్సరానికి ఒకటి చొప్పున తీస్తున్నాడు. రాజమౌళి ఇద్దరు హీరోలతో చేసిన ఆర్ఆర్ఆర్ రూ. 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ఒక్కటే దాన్ని బీట్ చేసి రూ. 1300 కోట్లు దక్కించుకుంది. ఇది నిజంగా రాజమౌళికి పెద్ద షాకనే చెప్పాలి.
నాలుగేళ్లలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే చేసి రూ. 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ మూడు సినిమాలు ప్రతీ మూవీ సంవత్సరంలో కంప్లీట్ చేసి రూ. 3000 కోట్ల దాకా వసూళ్లను సాధించాడు. ప్రస్తుతం సలార్ రూ. 500 కోట్ల మార్కు దాటి రూ. 1000 కోట్ల రికార్డు వైపుగా దూసుకెళ్తుంది. ఇలాంటి సమయంలో రాజమౌళి మీద కంటే ప్రశాంత్ నీల్ పైనే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఇంట్రస్ట్ చూపే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తోంది. వీటన్నింటికీ మహేశ్ బాబు సినిమాతో రాజమౌళి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.