Rayapati Broke Chandrababu Photo : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సినీయర్ నాయకుడు రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతో పాటు చంద్రబాబు, లోకేశ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ అసలు పార్టీనే కాదన్న ఆయన ఒక వ్యాపార సంస్థఅని ఆరోపించారు.
నాలుగు సార్లు గుంటూరు ఎంపీగా పనిచేసిన రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు టీడీపీని వీడారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన లేఖ ద్వారా రాజీనామా సమర్పించారు.
తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఫొటోను రంగారావు నేలకేసి కొట్టి తన అక్కసును వెళ్లగక్కారు. తనకు పార్టీ ఉన్న కోపాన్ని ఆయన ఈ సందర్భంగా వెళ్లగక్కారు. టీడీపీ విధానాలు నచ్చకనే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
రాయపాటి కుటుంబం ఆది నుంచి టీడీపీలోనే ఉంది. నాలుగు దఫాలుగా టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబ శివరావు 2019లో తన కుమారుడు రంగారావుకు గుంటూరు జిల్లా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కానీ ఆ సమయంలో బాబు సాంబ శివరావు అభ్యర్థనను తిరస్కరించారు. 2024లో కూడా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బాబు ససేమీరా అంటున్నారని తెలియడంతో బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడంతో పాటు రంగారావు కూడా టీడీపీని వీడారు.
ప్రస్తుతం గుంటూరు రాజకీయాల్లో రాయపాటి కుటుంబాన్ని పట్టించుకునే వారు లేకపోయినా చంద్రబాబు ఫొటోను పక్కన పెట్టడం నైతికంగా సరికాదని, ఇది రాయపాటిపై నెగిటివ్ ఇమేజ్ ను తెచ్చిపెడుతోందన్నారు.