Election Strategy : ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించేందుకు ఈనెల 23వ తేదీన టిడిపి వర్క్ షాప్ నిర్వహిస్తోంది. విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. వర్క్ షాప్ కు వచ్చే కార్యకర్తలకు పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల కార్యచరణ పై దిశా నిర్దేశం చేస్తారు. కాగా రెండు రోజుల్లో మిగిలిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించినట్లు సమాచారం అందుతుంది.
సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను సిద్ధం చేసుకునేందుకు కార్యచరణ రూపొందిస్తోంది. ఎన్నికల మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నదానిపై ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు.