Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి 11 గంటలకు చోటు చేసుకుంది. ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వే (సమృద్ధి మహామార్గ్)పై బంక్ దగ్గరకి వస్తున్న ఓ కారు రాంగ్ డైరెక్షన్ లో రావడంతో మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా.. మరో నలుగురు గాయపడ్డారు.
కారుని ఢీకొట్టిన మరో కారు బారికేడ్లను ఢీకొని పల్టీలు కొట్టి హైవేపై నుంచి కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును రోడ్డుపై నుంచి తొలగించారు. హైవేపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.