Megastar Chiranjeevi : ‘భోళా శంకర్’ రిలీజ్ రోజు నుంచి మెగాస్టార్ చిరంజీవిపై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. సినిమా అలా ఉంది.. ఇలా ఉంది.. ఇది బాలేదు.. అది బాలేదు.. ఇవన్నీ వారి అభిప్రాయాలు ఇవన్నీ ఒక ఎత్తయితే.. ప్రొడ్యూసర్ ను మోసం చేశాడు.. ఫెయిల్యూర్ సినిమాకు ముక్కు పిండి మరీ రూ. 60 నుంచి రూ. 65 కోట్లు వసూలు చేశారని ఇదో తీరు ట్రోలింగ్.. అసలు ఇందులో ఏ మాత్రం నిజం లేదు.
ఇండస్ట్రీలో స్టార్ నుంచి దాణ గుణం, సేవా గుణం అన్నింటిలో మెగాస్టార్ మెగానే. సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ ఒకే అనుకున్నా.. ఫ్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ ను ఎలాంటి ఇబ్బందులు పెట్టడు. ఇది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. బయట ఉన్న వైరల్ రాయుళ్లకు తెలియకపోవచ్చు. ఇక ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకు రూ. 55 కోట్లు తీసుకున్నాడని టాక్. ఆ సినిమా కూడా పెద్ద హిట్టయ్యింది. ఆ తర్వాత వచ్చిన తీయబోయే భోళా శంకర్ కు రూ. 10 కోట్లు పెంచి రూ. 60 నుంచి రూ. 65 కోట్లు తీసుకుంటున్నారన్నది ఇటీవల వస్తున్న ట్రోలింగ్ శారాంశం. అసలు ఏం జరిగిందన్నది తెలుసుకుందాం.
‘వాల్తేర్ వీరయ్య’కు రూ. 55 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్. ఆ సినిమా హిట్ కావడంతో ‘భోళా శంకర్’కు రూ. 60 కోట్ల నుంచి రూ. 65 కోట్లు అడిగారని టాక్. విడుదల వరకు నిర్మాత కొంత అడ్వాన్స్, కొంత చెల్లించాడు. మిగిలిన రూ. 10 కోట్లకు చెక్ ఇచ్చారు.
ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఇచ్చిన చెక్కును సోమవారం బ్యాంకులో వేసుకోవాలని కోరాడట. అంటే శుక్రవారం మూవీ విడుదలైతే, 4వ రోజు పేమెంట్ అయ్యేలా పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారన్నమాట. రిజల్ట్ మార్నింగ్ షోకే తెలిసి పోయింది. సాయంత్రం వరకు చూసిన నిర్మాతకు జరిగే నష్టం గురించి అర్థం అయ్యింది.
దీంతో అనిల్ సుంకర ఇచ్చిన రూ. 10 కోట్ల చెక్కును బ్యాంకులో వేయలేదని తెలుస్తోంది. అంటే మెగాస్టార్ రూ. 50 కోట్ల రెమ్యూనిరేషన్ మాత్రమే తీసుకున్నారన్నమాట. కనీసం నిర్మాతకు ఆ మాత్రం రిలీఫ్ ఉండడం మంచిదే కదా. ‘భోళాశంకర్’ దారుణమైన ఫ్లాపుగా మిగిలింది. నైజాంలో ‘వాల్తేర్ వీరయ్య’ రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తే ‘భోళా శంకర్’ రూ. 7 కోట్ల దగ్గరే ఆగిపోయింది.