Shreya Dhanwantari సోషల్ మీడియా వచ్చాక చాలా మంది తమ అందాలను ఆరబోస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అదే పనిగా పెట్టుకుంటున్నారు. ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతున్నారు. సినిమాల్లో చేసి అవకాశాలు లేక తిరుగుతున్న వారంతా ఇదే పంథా ఎంచుకుంటున్నారు. దీంతోనైనా నిర్మాతల కళ్లలో పడితే సినిమా అవకాశాలు వస్తాయనేది వారి తపన. ఈ నేపథ్యంలో మన తెలుగు బ్యూటీ శ్రేయ ధన్వంతరి కూడా అదే బాటను ఎంచుకుంది. తన అందాలను చూపిస్తూ అందరిలో నరాలు జివ్వుమనేలా చేస్తోంది.
హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో పుట్టిన శ్రేయ ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీలో నిలిచి సత్తా చాటింది. మోడలింగ్ లో రాణిస్తూ ఎయిర్ టెల్, ఫాంటలూన్స్, నఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాప్స్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి సంస్థలకు ప్రకటనల్లో నటించింది.
ఇక నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాలో నటించింది. కాకపోతే రెండు మూడు సీన్లలోనే మెరిసింది. కానీ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తరువాత సందీప్ కిషన్ తో స్నేహగీతంలో నటించింది. ఇది కూడా హిట్ కాలేదు. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు డాల్, షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు తీస్తూ కాలం గడిపింది. రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా మారింది.
బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాలని చూసింది. ది గర్ల్ ఇన్ మీ, నై చీట్ ఇండియా, లేడీస్ రూం, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ బపేటా, చుప్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది. అయినా తన దశ మారకపోవడంతో తాజాగా సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తోంది. బీచ్ లో ఓపెన్ గా అందాలు చూపిస్తూ కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.