ఎమ్మెల్యేల అవినీతిని బయటకు రానివ్వకుండా మెయిన్ స్ట్రీం మీడియాను సీఎం కేసీఆర్ కంట్రోల్ చేయగల్గుతున్నారు. అయితే మెయిల్ స్ట్రీం మీడియాను దాదాపు అదుపులో పెట్టినప్పటికీ..సోషల్ మీడియాను నియంత్రించడం కేసీఆర్ వల్ల కావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయా సెగ్మెంట్ల వారిగా శాసన సభ్యులు చేసిన ఘనకార్యాలు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయి. ఇలా వచ్చిన వీడియో లు,కంటెంట్ పబ్లిక్లోకి విస్తృతంగా వెళుతోంది. దీంతో అధికార పార్టీ శాసన సభ్యులు చేసిన లీలలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఎమ్మెల్యేలపై పబ్లిక్లో వ్యతిరేకత బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్యేలపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అంతేకాక పబ్లిక్లో వ్యతిరేకత ఉన్న శాసన సభ్యులపై ఆయన ప్రత్యేక నిఘా పెట్టారు. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే ఆయన తెప్పించుకున్న నిఘా వర్గాల నివేదికల్లో సుమారు 50 మంది ఎమ్మెల్యేలపై పబ్లిక్లో బాగా వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. దీంతో వారికి రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్ ఇస్తే తన పుట్టి మునగడం ఖాయమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు టాక్.