Shruti Haasan : బాహుబలి తరువాత ప్రభాస్ కు హిట్ లేదు. సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు వరుసగా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో రాబోయే సలార్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీసు కొల్లగొడుతుందని అనుకుంటున్నారు. నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. కానీ సినిమా వర్క్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని ప్రచారం సాగుతోంది. దీంతో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి విడుదల చేస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై శ్రుతిహాసన్ ఆశ్చర్యపరచే విషయాలు బయటపెట్టింది. ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పుకుంటూ పోతుంటే ఆలస్యం అవుతుందని చెబుతోంది.
ఈ నేపథ్యంలో సలార్ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందా అనే వాదన కూడా వస్తోంది. నెల రోజుల్లో సినిమా థియేటర్లలోకి రానుండటంతో ట్రైలర్ కూడా పూర్తి చేస్తున్నారు. సలార్ ట్రైలర్ సునామీ తీసుకురావడం ఖాయమని చిత్రం యూనిట్ భావిస్తోంది. సలార్ రెండు భాగాలుగా వస్తోంది. ప్రస్తుతం మొదటి భాగం పూర్తి చేసుకుంటోంది.
ఇందులో జగపతిబాబు, మలయాళ నటుడు ప్రధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. గతంలో వచ్చిన చిత్రాలకన్నా భిన్నంగా ఇది ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే సినిమా విజయం సాధిస్తుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. సలార్ సినిమా విజయం సాధిస్తేనే ప్రభాస్ కు మనుగడ ఉంటుందని అంటున్నారు. దీంతో దీనిపై సహజంగానే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.