కన్నడ నాట స్టార్ హీరో కిచ్చా,మరో స్టార్ దర్శన్ను రంగంలోకి దింపింది. ఇక కాంగ్రెస్ తరపున మాండ్యా ఎంపీ,కన్నడ సినీ బ్యూటీ రమ్యాను ఆ పార్టీ బరిలో నిలిపింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ఎంతలా ప్రయత్నించినప్పటికీ..బీజే
తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఈయన పెట్టిన పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. ఆ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా ఆపార్టీ గెలుచుకోలేదు. ఈనేపథ్యంలోనే కమల్ హాసన్ ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం బెంగళూరులోని తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కమల్తో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ చూస్తోంది. గాంధీనగర్,పులకేశీనగర,చిక్కపే
అయితే వారి ఆలోచనలు ఎలా ఉన్నా..తమిళనాడులో పార్టీ పెట్టి అట్టర్ ప్లాప్ అయిన కమల్ను పట్టుకొచ్చి బెంగళూరులో ప్రచారం చేయిస్తే ఏ మేరకు కాంగ్రెస్కు లాభిస్తోందో మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళనాడులో ఉన్న తమిళులే ఆయన పెట్టిన పార్టీకి ఓట్లేయనప్పుడు..బెంగళూరులో ఉంటున్న తమిళులు ఎలా ఓట్లేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో చెల్లని రూపాయి.. కర్నాటకలో ఎలా చెల్లుతుందనే డిస్కషన్ బెంగళూరు పొలిటికల్ సర్కిల్స్ సాగుతోంది.