Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన పద్మరాజన్ పోటీ చేస్తూ ఉంటాడు. సర్పంచ్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఏ ఎన్నికైన ఇతర బరిలో ఉంటాడు. ఇప్పటివరకు పద్మరాజన్ 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు.
ఎలక్షన్ కింగ్ గా పిలిచే పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. వాజ్పేయి, మన్మో హన్ సింగ్, మోడీ, రాహుల్ గాంధీ మీద పోటీకిలో దిగారు. డిపాజిట్ల రూపంలో రూ లక్షలు నష్టపోయారు. ప్రస్తుతం ఆయన ధర్మపురి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ఇప్పటికైనా ఎన్నికల్లో విజయం సాధించకుండా పోతానని పద్మ రాజన్ పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే లక్షల రూపాయలు డిపాజిట్ ల కోసం ఖర్చు చేశాడు. అంత ఖర్చు అవుతున్నప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉన్నాడు. ఇతడి ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.