TDP : సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దూకుడు ప్రదర్శించింది. వైసీపీ వికటట్టహాసంతో రెచ్చిపోతున్న వేళ ప్రతిపక్ష టీడీపీ క్షేత్రస్థాయి ఎన్నికల్లో గెలుపు వచ్చేసారి అధికారానికి సోపానంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి ఫశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ధమ్మేన్నులో పంచాయతీ వార్డు సభ్యుడి ఉప ఎన్నికలో టీడీపీ బలపరచిన అభ్యర్థి మట్టపర్తి అచ్యుత రామయ్య 27 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. కొవ్వూరు మండలం 8వ వార్డుకు జరిగిన ఎన్నికలో జనసేన బలపరచిన అభ్యర్థి కొడమంచిలి నాగమణి 33 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్ పేట ఏడో వార్డులో టీడీపీ మద్దతు దారు వల్లూరు శివానందం గెలుపొందాడు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం 9వ వార్డు ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు దారు ఓబులేసు 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. నంద్యాల జిల్లా పంజాముల మండలం ఇరుమల్లలో వార్డు సభ్యురాలు టీడీపీ అభ్యర్థి గెలుపొందాడు.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్యాల మపంచాయతీ 12వ వార్డు ఎన్నికలో టీడీపీ బలపరచిన అభ్యర్థి ఆదయ్య 11 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నెల్లూరు జిల్లా పులిగిలపాడులో టీడీపీ మద్దతుదారు నిమ్మల రాజయ్య 23 ఓట్ల తేడాతో గెలుపొందాడు. జలదంకి మండలం వేలులపాడు 7వ వార్డులో టీడీపీ బలపరచిన అభ్యర్థి పొట్లూరి ఆదిలక్ష్మి 34 ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
కొండాపురం మండలం సాయిపేట మూడో వార్డు లో సనంగుల రవి 65 ఓట్ల తేడాతో గెలిచారు. చేజర్ల మండలం పాతపాటు ఐదో వార్డులో టీడీపీ, వైసీపీకి సమాన ఓట్లు రావడంతో రీ కౌంటింగ్ చేయించారు. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామపంచాయతీ తొమ్మిదో వార్డు అభ్యర్థి సుంకమ్మ 21 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యల్లనూరు మండలం బొప్సేపల్లి గ్రామపంచాయతీ మూడో వార్డు సభ్యురాలుగా మంజుల లీలావతి 65 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
యల్లనూరు మండలం జంగంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థి కుశ్మాయప్ప నాయుడు 18 ఓట్లు తేడాతో గెలుపొందారు. కొల్లూరు మండలం చిలుమూరు నాలుగో వార్డులో టీడీపీ బలపరచిన అభ్యర్థి విజయం సాధించాడు. దోనేపూడి ఐదో వార్డులో టీడీపీ మద్దతుదారు గెలుపు. అమ్తలూరు మండలం మూల్సురులో రెండో వార్డులో టీడీపీ మద్దతుదారు విజయం.
వేమూరు మండలం వరాహపురురం పదో వార్డులో మద్దతు దారు విజయం సాధించాడు. కర్లపాలెం మండలం బుద్దాం ఆరో వార్డు ఉప ఎన్నికలో టీడీపీ మద్దతుదారు నర్రా వెంకటేశ్వర్లు 28 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చుండూరు మండలం మున్నంగివారి పాలెం సర్పంచ్ ఎన్నికలో జనసేన మద్దతుదారు శ్రీరామమూర్తి 63 ఓట్ల తేడాతో గెలుపొందారు.
దెందులూరు మండలం సీతంపేటలో 5,11వ వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల గెలుపు. గోపన్నపాలెంలో 11వ వార్డులో టీడీపీ మద్దతుదారు సత్యనారాయణ విజయం. పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీలో వైసీపీ మద్దతు దారు సోమేశ్వర్ రావు 286 ఓట్ల మెజార్టీతో గెలుపు. పోలవరం మండలం చేగొండపల్లిలో టీడీపీ బలపరచిన అభ్యర్థి మూలం రాజు గెలుపొందారు.
అగిరిపల్లి మండలం అడవి నెక్కలం గ్రామపంచాయతీ సర్పంచ్ గా వైసీపీ బలపరచిన అభ్యర్థి వేము రాజు 320 ఓట్ల తేడాతో విజయం. ముదినేపల్లి మండలం వనురుద్రు సర్పం్ గా వైసీపీ మద్దతుదారు సుగుణబాయి 444 ఓట్ల తేడాతో విజయం. గూడూరు మండలం పోలవరం 11వ వార్డులో టీడీపీ మద్దతుదారు నాగమణి 41 ఓట్ల తేడాతో గెలుపొందింది.
పెడన మండలం కాకర్లముడి పంచాయతీలో 4వ వార్డులో టీడీపీ మద్దతు దారు గుడిపె లక్ష్మి తిరుపతమ్మ విజయం. గండికుంట పదో వార్డులో టీడీపీ బలపరచిన వీరంకి పాండురంగారావు 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈపూరు మండలం ఉప్పరపాలెంటో 8వ వార్డులో టీడీపీ మద్దతుదారు మేకల లక్ష్మయ్య 14 ఓట్ల తేడాతో విజయం. అమరావతి మండలం యండ్రాయిలో 2వ వార్డులో టీడీపీ మద్దతుదారు యడ్ల శ్రీనాథ్ 98 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు.
నకరికల్లు మండలం గుండ్లపల్లి 5వ వార్డులో 284 ఓట్ల తేడాతో టీడీపీ మద్దతుదారు జూపల్లి మోపే గెలుపొందారు. పెదకూరపాడు మండలం మూసాపురం 9వ వార్డులో వైసీపీ మద్దతుదారు బత్తుల విజయలక్ష్మి 10 ఓట్ల తేడాతో విజయం. మాచవరం మండలం పిల్లుట్లలో వైసీపీ బలపరచిన అభ్యర్థి విజయం. అచ్చంపేట మండలం మాదిపాడులో టీడీపీ మద్దతుదారు 23 ఓట్ల తేడాతో గెలుపు. ధరణికోట 11వ వార్డులో వైసీపీ మద్దతు దారు 51 ఓట్లతో విజయం.
* టీడీపీ అభ్యర్థులు గెలిచిన సీట్లు ఇవే..
రావిపాడు 29 ఓట్లతో టీడీపీ అభ్యర్థి మహంకాళి పావని విజయం.
-పెదనందిపాడు మండలం రావిపాడు టిడిపి గెలుపు అభ్యర్థి పేరు మహంకాళి పావని 29 ఓట్లు మెజార్టీతో గెలుపు
-పెదనందిపాడు మండలంAB పాలెం టిడిపి అభ్యర్థి మదమంచి వేణు బాబు 127 ఓట్ల మెజార్టీ
-తిరువూరు నియోజవర్గంలో తిరువూరు మండలం వీరంపాడు పంచాయతీలో టిడిపి గెలుపు పొందింది
-పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామంలో టిడిపి అభ్యర్థి , గుంటుపల్లి ఈశ్వర ప్రసాద్ 78 ఓట్ల మెజార్టీతో గెలుపు
-పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామంలో టిడిపి అభ్యర్థి , గుంటుపల్లి ఈశ్వర ప్రసాద్ 78 ఓట్ల మెజార్టీతో గెలుపు
-వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం, చిలుమూరు 33 ఓట్లతో టీడీపీ గెలుపు
-దోనేపూడి 62 ఓట్ల మెజారిటీ తో టీడీపీ అభ్యర్థి గెలుపు
వేమూరు నియోజకవర్గం, మూల్పూరు 2వ వార్డ్ 8 ఓట్ల తో టీడీపీ గెలుపు.. 4వ వార్డ్ లో టీడీపీ ఓటమి
తణుకు నియోజవర్గంలో ఇరగవరం మండలం కావాలిపురం గ్రామంలోని జరిగిన సర్పంచ్ కు హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో టిడిపి బలపరచిన అభ్యర్థి వనచర్ల అప్పన్నస్వామి గారు బారి మెజారిటీతో గెలుపు.