Headache For Rohit Sharma : ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఐదు మ్యాచుల్లో విజయం సాధించి ఊపుమీదుంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే కసితో ఉంది. ఆటగాళ్లలో సమన్వయం కుదిరింది. దీంతో ఈనెల 29న ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో కూడా గెలవాలని ఉత్సాహంతో ఉంది. టీమిండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం జట్టులో రెండు మార్పులు చేయాల్సి వస్తోంది. గాయం కారణంగా హార్థిక్ పాండ్యా దూరం అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీని జట్టులోకి తీసుకున్నారు. హార్థిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు కల్పించారు. షమీ తన మాయాజాలంతో న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. శార్దుల్ ఠాకూర్ జట్టులో ఉన్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది.
షమీ నాలుగు మ్యాచుల్లో ఆడలేదు. తొలి మ్యాచ్ లో అశ్విన్ ను తీసుకున్నారు. తరువాత మూడు మ్యాచ్ ల్లో శార్దుల్ ను ఆడించినా నిరుపయోగమే. షమీ కివీస్ నడ్డి విరిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఇఫ్పుడు జట్టుకు షమీ అవసరం ఏర్పడింది. ఈ ప్రపంచ కప్ లో తొలి బంతికే వికెట్ తీశాడు షమీ. అలా తన బౌలింగ్ లో పదును తేలాడు.
వరల్డ్ కప్ లో షమీని పక్కన పెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ ప్రభావం చూపని శార్దుల్ ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. శార్దుల్ ఆల్ రౌండర్ అయినా ఏ విభాగంలోనూ రాణించకపోవడం గమనార్హం. ఇప్పుడు షమీ, హార్థిక్ పాండ్యా ల్లో ఎవరిని తీసుకోవాలో కెప్టెన్ కు అర్థం కావడం లేదు. అతడికి పెద్ద తలనొప్పిగా మారింది.