Manmadudu Missed : ఏ ఇండస్ట్రీలో అయిన ఒక్కో సినిమా ఎప్పటికి మరచిపోలేము.. ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది.. మరి అలాంటి క్లాసికల్ చిత్రాలలో ఒకటి ‘మన్మధుడు’.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచి పోయింది.. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..
రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా తన మాటల లోని విశ్వరూపాన్ని చూపించాడు.. ఆయన రాసిన ప్రతీ డైలాగ్ బాగా ఆకట్టుకుంది.. ఈయన డైలాగ్స్ ఇప్పటికి ఫ్యాన్స్ కు బాగా గుర్తిండి పోయాయి.. అప్పట్లో డైరెక్టర్ విజయ్ భాస్కర్ సినిమాలకు త్రివిక్రమ్ ఆస్థాన కవిగా ఉండేవాడు.. ఈ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
అయితే ఎప్పుడైతే త్రివిక్రమ్ తన సొంతంగా తియ్యడం స్టార్ట్ చేసాడో అప్పటి నుండి విజయ్ భాస్కర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉండగా మన్మధుడు సినిమా అప్పట్లోనే 14 కోట్ల రూపాయలు షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. క్లాస్ సినిమా కావడంతో మాస్ సెంటర్స్ లో లాంగ్ రన్ అప్పుడు కొద్దిగా కలెక్షన్స్ తగ్గాయి.. అందుకే మరిన్ని కలెక్షన్స్ సాదించలేక పోయింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ముందుగా నాగార్జున కాకుండా యంగ్ హీరో తరుణ్ తో చేద్దాం అని అనుకున్నారట.. కానీ ఆ సమయంలో ఈయన వేరే సినిమా కమిట్ అవ్వడంతో మన్మధుడు మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది.. అప్పట్లో ఈయనే లవ్ స్టోరీలను చేస్తుండేవాడు.. అందుకే ఈయన అయితే మరింత ఆకట్టుకునే వాడు.. ఈ సినిమా మిస్ అయిన త్రివిక్రమ్ మొదటి సినిమా తరుణ్ తో నువ్వే నువ్వే చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మన్మధుడు ఒప్పుకుని చేసి ఉంటే ఈయన కెరీర్ మరింత బెస్ట్ గా నిలిచేది అని అంటున్నారు.